Greatest Batters of all time : ఆల్ టైమ్ గ్రేట్ ఇండియన్ బ్యాట‌ర్ ఎవ‌రు..? స‌చిన్, కోహ్లీ కాదా..? మరి ఇంకెవ‌రంటే..?

భార‌త క్రికెట్‌లోనే కాదు ప్ర‌పంచ క్రికెట్‌లోనే అత్యుత్త‌మ ఆట‌గాడిగా కీర్తి గ‌డించాడు దిగ్గ‌జ ఆట‌డాడు స‌చిన్ టెండూల్క‌ర్‌.

Greatest Batters of all time

భార‌త క్రికెట్‌లోనే కాదు ప్ర‌పంచ క్రికెట్‌లోనే అత్యుత్త‌మ ఆట‌గాడిగా కీర్తి గ‌డించాడు దిగ్గ‌జ ఆట‌డాడు స‌చిన్ టెండూల్క‌ర్‌. ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పాడు. కాగా.. క్రికెట్ వీరాభిమానులు అత‌డిని క్రికెట్ దేవుడు అని పిలుస్తారు. స‌చిన్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం ఇప్ప‌ట్లో ఎవ‌రికి సాధ్యం అని అంద‌రూ ఓ అంచ‌నాకు వ‌చ్చేసిన స‌మ‌యంలో చిచ్చ‌ర‌పిడులా దూసుకువ‌చ్చాడు విరాట్ కోహ్లీ. ప‌రుగ‌ల యంత్రంగా పేరుగాంచాడు.

స‌చిన్ పేరుట ఉన్న చాలా రికార్డుల‌ను కోహ్లీ బ‌ద్ద‌లు కొట్టాడు. ఇటీవ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా స‌చిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రు భార‌త జ‌ట్టులోనే కాక ప్ర‌పంచంలోనే గొప్ప క్రికెట‌ర్లుగా ఉన్నారు. వీరిద్ద‌రిలో ఆల్ టైమ్ గ్రేట్ ఇండియన్ బ్యాట‌ర్ ఎవ‌రు అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఇదే విష‌య‌మై ఓ పాకిస్తాన్ మాజీ ఆట‌గాడికి ప్ర‌శ్న ఎదురు కాగా వీరిద్ద‌రు కాద‌ని మ‌రో భార‌త ఆట‌గాడి పేరు చెప్పాడు.

IPL 2024 Auction : 77 స్థానాలు.. 1166 మంది పోటీ.. ట్రావిస్ హెడ్‌, ర‌చిన్ ర‌వీంద్ర‌ల బేస్‌ప్రైజ్ ఎంతంటే..?

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌నే గ్రేటెస్ట్ ఇండియా బ్యాట‌ర్ అని పాకిస్తాన్ మాజీ పేస‌ర్ జునైద్ ఖాన్ తెలిపాడు. రోహిత్ శ‌ర్మ అన్ని ర‌కాల షాట్ల‌ను అవ‌లీల‌గా ఆడ‌తాడ‌న్నాడు. వ‌న్డేల్లో రోహిత్ అత్య‌ధిక స్కోరు 264. ఈ ఫార్మాట్‌లో అత‌డు మూడు డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు. అంతేకాకుండా అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టాడు. అందుక‌నే త‌న దృష్టిలో రోహిత్ శ‌ర్మ‌నే భార‌త క్రికెట్‌లో గొప్ప ఆట‌గాడ‌ని చెప్పుకొచ్చాడు.

టెస్టుల‌కే ప‌రిమితం కానున్న‌ రోహిత్ శ‌ర్మ‌..?

2022లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్ త‌రువాత నుంచి టీ20ల్లో ఇటీవ‌ల ముగిసిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్ త‌రువాత నుంచి వ‌న్డేల్లో రోహిత్ శ‌ర్మ ఆడ‌డం లేదు. అత‌డు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ ఈ రెండు ఫార్మాట్ల‌ల‌లో అత‌డు ఆడ‌డం లేదు. కేవ‌లం టెస్టుల్లో మాత్ర‌మే ఆడుతున్నాడు. అత‌డిని ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ఇక చూడ‌లేమ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని భావిస్తున్న రోహిత్ శ‌ర్మ కేవ‌లం టెస్టుల‌కే ప‌రిమితం కావాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

Team India : టీ20ల్లో టీమ్ఇండియా వ‌ర‌ల్డ్ రికార్డు.. పాకిస్తాన్ మ‌న వెన‌కే..

Rohit Sharma

కాగా.. ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ల‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని రోహిత్ శ‌ర్మ‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విజ్ఞ‌ప్తి చేసింది. అయితే దీన్ని రోహిత్ శ‌ర్మ సున్నితంగా తిర‌స్క‌రించాడు. తాను ప్ర‌స్తుతం యూకే ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాన‌ని కొంత కాలం పాటు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ నుంచి విశ్రాంతి కావాల‌ని రోహిత్ చెప్పిన‌ట్లు బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఒక‌వేళ అత‌డు టీ20లు ఆడాల‌ని భావిస్తే మాత్రం యూఎస్‌-వెస్టిండీస్ వేదిక‌గా జూన్‌లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియాకు రోహితే కెప్టెన్‌గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయని బీసీసీఐ వ‌ర్గాలు తెలిపాయి.

ట్రెండింగ్ వార్తలు