Pakistan Cricketers : హైద‌రాబాద్‌లో పాక్ ఆట‌గాళ్ల షికార్లు.. రెస్టారెంట్‌లో డిన్న‌ర్‌.. సెల్ఫీల కోసం ఎగ‌బ‌డిన ఫ్యాన్స్‌..

అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప‌టికే భార‌త్‌కు చేరుకుంది పాకిస్తాన్‌ (Pakistan).

Pakistan Team Dinner At Jewel Of Nizam

Pakistan Cricketers : అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప‌టికే భార‌త్‌కు చేరుకుంది పాకిస్తాన్‌ (Pakistan). హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో వార్మ‌ప్ మ్యాచులు ఆడేందుకు మూడు రోజుల క్రిత‌మే వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో పాక్ జ‌ట్టుకు ఘ‌న స్వాగ‌తం లభించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆనందం వ్య‌క్తం చేశారు. కాగా.. ప్ర‌పంచ‌క‌ప్ స‌న్నాహాకాల్లో ఉన్న పాకిస్తాన్ జ‌ట్టు హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో విందుకు వెళ్లారు.

ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది టీమ్ బ‌స్‌లో ‘జువెల్ ఆఫ్ నిజాం’ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్క‌డ డిన్న‌ర్ చేశారు. రుచికరమైన సాంప్రదాయ హైదరాబాదీ వంటకాలను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. పాకిస్తాన్ టీమ్ డిన్న‌ర్ గ్లింప్స్ అంటూ ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. కాగా.. పాక్ ఆట‌గాళ్లు హోట‌ల్‌కు చేరుకోగానే కొంద‌రు వారికి చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తం ప‌లికారు. మ‌రికొంద‌రు వారితో ఫోటోలు దిగేందుకు ఆస‌క్తి చూపించారు.

ODI world Cup : టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా..?

ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి వార్మ‌ప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓట‌మి పాలైంది. నిర్ణీత‌ 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 345 ప‌రుగులు భారీ స్కోరు చేసిన‌ప్ప‌టికీ దాన్ని కాపాడుకోవ‌డంలో విఫ‌లమైంది. ల‌క్ష్యాన్ని కివీస్ 43.4 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. అక్టోబ‌ర్ 3న రెండో వార్మ‌ప్ మ్యాచులో ఆస్ట్రేలియాతో పాక్ త‌ల‌ప‌డ‌నుంది. ఇక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ అక్టోబ‌ర్ 6న‌ త‌న తొలి మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్‌తో ఆడ‌నుంది. క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అక్టోబ‌ర్ 14న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు