ODI world Cup : టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా..?

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ (ODI world Cup) 2023 మ‌రో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున ఎక్కువ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన క్రికెట‌ర్లు ఎవ‌రు అన్న చ‌ర్చ మొద‌లైంది.

ODI world Cup : టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా..?

Who have played most ODI World Cups for Team India

ODI world Cup Team India players : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ (ODI world Cup) 2023 మ‌రో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. మొద‌టి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్‌తో ర‌న్న‌ర‌ప్ న్యూజిలాండ్ త‌ల‌ప‌డుతోంది. అక్టోబ‌ర్ 5న అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇక భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచులో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. అక్టోబ‌ర్ 8న చెన్నై వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక‌ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన క్రికెట‌ర్లు ఎవ‌రు అన్న చ‌ర్చ మొద‌లైంది. ఆ వివ‌రాలు చూద్దాం..

దిగ్గ‌జాల‌ జాబితాలో చేర‌నున్న కోహ్లీ..

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (2011, 2015, 2019)లు ఆడాడు. ఇప్పుడు ఆడబోయేది అత‌డి నాలుగో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌. కోహ్లీ కంటే ముందు క‌పిల్ దేవ్‌, సునీల్ గ‌వాస్క‌ర్‌, అజారుద్దీన్‌, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్‌లు నాలుగు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలు ఆడారు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌తో కోహ్లీ వీరి జాబితాలోకి చేర‌నున్నాడు.

అంద‌నంత ఎత్తులో స‌చిన్‌..

టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను ఆడిన జాబితాలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. స‌చిన్ త‌న కెరీర్‌లో 6 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడాడు. 1992, 1996, 1999, 2003, 2007, 2011 ప్ర‌పంచ‌కప్‌ల‌లో స‌చిన్ ఆడాడు.

Shadab Khan : రోహిత్ శ‌ర్మ ఇష్ట‌మైన ఆట‌గాడు.. ఇలాగే తింటే లావైపోతాం..

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలు ఆడిన రికార్డును పాకిస్తాన్ మాజీ ఆట‌గాడు మియాందాద్‌తో క‌లిసి స‌చిన్‌ సంయుక్తంగా క‌లిగి ఉన్నాడు. మియాందాద్ కూడా 6 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో భాగ‌స్వామ్యం అయ్యాడు. వీరిద్ద‌రి త‌రువాత ఆసీస్ మాజీ ఆట‌గాడు రికీ పాంటింగ్‌, మ‌హేలా జ‌య‌వ‌ర్ధ‌నే, జాక్వెస్‌ క‌లిస్ లు ఐదు సార్లు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడారు.