Hardik Pandya
Mumbai Indians Captain : గత కొంతకాలంగా ముంబై ఇండియన్స్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను ట్రేడింగ్లో తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో తమ జట్టుకు ఐదు సార్లు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అయితే.. వన్డే ప్రపంచకప్లో గాయపడిన హార్దిక్ పాండ్య ఇంకా కోలుకోనట్లుగా వార్తలు వస్తున్నాయి.
దీంతో అతడు జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్తో ప్రారంభం కానున్న మూడు టీ20 మ్యాచుల సిరీస్కు దూరం కానున్నాడని, ఐపీఎల్ 2024 సీజన్కు సైతం అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ పాండ్య గనుక ఐపీఎల్ 2024 సీజన్కు దూరం అయితే ముంబై ఇండియన్స్కు అది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. అప్పుడు ముంబై జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారు అనే చర్చ మొదలైంది.
రోహిత్ శర్మ కష్టమే..
Rohit Sharma
ఒకవేళ పాండ్య ఐపీఎల్ కి దూరం అయితే.. రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్గా నియమించాలని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే.. ఇందుకు రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా..? అన్నది ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం హిట్మ్యాన్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి.
సూర్యకుమార్ యాదవ్..
Suryakumar Yadav
ఐపీఎల్ 2023 సీజన్లో సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్ గైర్హాజరీలో కేకేఆర్తో జరిగిన మ్యాచులో ముంబైకి కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. కాగా.. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్కు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే.. ఈ సిరీస్లోని ఆఖరి మ్యాచ్లో అతడి చీలమండలానికి గాయమైంది. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. హార్దిక్ అందుబాటులో లేకుంటే అతను ముంబైకి నాయకత్వం వహించగలడు.
జస్ప్రీత్ బుమ్రా..
bumrah
ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. తన కెరీర్ ఆరంభం నుంచి అతడు ముంబై జట్టుతోనే కొనసాగుతున్నాడు. అంతేకాకుండా టీమ్ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం అతడి సొంతం. ఓ టెస్టు, రెండు టీ20ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
ఇషాన్ కిషన్..
ishan kishan
ఇషాన్ కిషన్ అనగానే అతడి సామర్థ్యం పై చాలా మందికి సందేహాలు ఉండొచ్చు. అయితే.. అతడు 2016లో అండర్ 19 ప్రపంచకప్లో భారత అండర్ 19 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. అతడి నాయకత్వంలో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. 2018 నుంచి ముంబై జట్టుతో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్కు హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండకపోతే.. సూర్య, బుమ్రా, ఇషాన్లలో ఒకరు ముంబై ఇండియన్స్కు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.