Double Century In T20: టీ-20లో డబుల్ సెంచరీ.. అద్భుత ఘనత సాధించిన విండీస్ క్రికెటర్

మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్‌లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్ వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రకీం కార్నెల్. మన వాళ్లకు అతడు అంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే తన జాతీయ జట్టు తరఫున ఆడింది తొమ్మిది టెస్టులు మాత్రమే. అయితే రకీం కార్నెల్‌ ఈ ఫీట్ సాధించింది విండీస్‌ తరఫున ఆడుతూ కాదు. అమెరికా వేదికగా టీ20 టోర్నమెంట్‌ అట్లాంటా ఓపెన్‌లో అట్లాంటా ఫైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చెలరేగాడు.

Double Century In T20:వన్డేల్లో సెంచరీలు కామన్.. కానీ డబుల్ సెంచరీలు అంటే ఎప్పుడో ఒకసారి జరిగే అద్భుతం. అదే టీ-20 అయితే హాఫ్ సెంచరీ కొట్టడమే ఎక్కువ. ఎప్పుడో కానీ సెంచరీ చేరిన సందర్భాలు కనిపించవు. కారణం పరిమిత ఓవర్లు. అయితే ఇదే టీ-20లో ఓ క్రికెటర్ డబుల్ సెంచరీ బాదాడంటే నమ్మగలరా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఇది నిజంగా నిజమే.

మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్‌లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్ వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రకీం కార్నెల్. మన వాళ్లకు అతడు అంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే తన జాతీయ జట్టు తరఫున ఆడింది తొమ్మిది టెస్టులు మాత్రమే. అయితే రకీం కార్నెల్‌ ఈ ఫీట్ సాధించింది విండీస్‌ తరఫున ఆడుతూ కాదు. అమెరికా వేదికగా టీ20 టోర్నమెంట్‌ అట్లాంటా ఓపెన్‌లో అట్లాంటా ఫైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చెలరేగాడు.

కేవలం 77 బంతుల్లో 266.23 స్ట్రైక్‌రేట్‌తో 205 పరుగులను బాదేశాడు. అందులో 22 సిక్స్‌లు, 17 ఫోర్లు ఉండటం గమనార్హం. దీంతో స్క్వేర్‌ డ్రైవ్‌ జట్టుపై అట్లాంటా ఫైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 326 పరుగులు చేసింది. ప్రముఖ గణాంక నిపుణుడు మోహన్‌దాస్‌ మేనన్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు.

Mumbai Police’s Dussehra Message: బుల్లెట్టు బండిపై తిరిగిన 10 తలల రావణుడు.. అలరిస్తున్న వీడియో

ట్రెండింగ్ వార్తలు