Rahul Dravids son Samit Dravid gets his first Maharaja Trophy T20 contract
Rahul Dravids son Samit Dravid : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ సూపర్ ఛాన్స్ కొట్టేశాడు. ‘మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20’ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. వేలంలో అతడికి తక్కువ ధరే లభించినప్పటికి కూడా టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లతో ఆడే అవకాశం లభించింది.
మహారాజా ట్రోఫీని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. ఆరు జట్లు పోటీపడే ఈ టోర్నీ 2022 నుంచి జరుగుతోంది. ఇక సమిత్ ద్రవిడ్ ను గతేడాది రన్నరప్గా నిలిచిన మైసూర్ వారియర్స్ సొంతం చేసుకుంది. రూ.50 వేలకు ప్రాంఛైజీ వేలంలో అతడిని దక్కించుకుంది. 18 ఏళ్ల సమిత్ ఇప్పటి వరకు సీనియర్ స్టాయిలో క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు స్టార్ ఆటగాళ్లు అయిన ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, కృష్ణప్ప గౌతమ్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
Paris olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ విశేషాలివే..
మైసూర్ వారియర్స్ కు కరుణ్ నాయర్ నాయకత్వం వహిస్తున్నాడు. వీరందరి సావాసంలో సమిత్ మరింత రాటుదేలనున్నాడు. పేస్ ఆల్రౌండర్ అయిన సమిత్.. మిడిల్ ఆర్డర్లో ఎంతో నమ్మదగిన ఆటగాడిగా ఉన్నాడు. కూచ్ బెహర్ ట్రోఫీ గెలిచిన కర్ణాటక అండర్-19 జట్టులో సమిత్ సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇటీవల టీమ్ఇండియా ద్రవిడ్ మార్గనిర్దేశంలో టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచింది. అనంతరం ద్రవిడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. దాదాపు రెండున్నర సంవత్సరాలు హెడ్ కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఎంతో మంది కుర్రాళ్లకు భారత జట్టులో చోటు కల్పించాడు. ప్రస్తుతం ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ ఎంపిక అయ్యాడు. గంభీర్ మార్గనిర్దేశంలో టీమ్ఇండియా జూలై 27 నుంచి శ్రీలంకతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది.
మైసూర్ వారియర్స్ జట్టు :
కరుణ్ నాయర్, కార్తీక్ సీఏ, మనోజ్ భండగే, కార్తీక్ ఎస్యూ, సుచిత్ జే, గౌతమ్ కే, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ్ కృష్ణ , మహమ్మద్ సర్ఫరాజ్.