Rishabh Pant Sister Sakshi : టీమ్ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి సోదరి సాక్షి పంత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలో తనకు కాబోయే బావ, సోదరి, తల్లితో కలిసి దిగిన ఫోటోలను పంత్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాబోయే వధూ వరులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా.. సాక్షీ, అంకిత్ చౌదరీలు గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఎంగేజ్మెంట్ ను చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. తమ తొమ్మిదేళ్ల లవ్స్టోరీలో మరో కొత్త చాఫ్టర్ మొదలైందని సాక్షి ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది.
Kieron Pollard : ముంబై కెప్టెన్సీ వివాదం.. రోహిత్కు మద్దతుగా పొలార్డ్..! అవసరం తీరగానే..
రీ ఎంట్రీ ఎప్పుడో..
2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు రిషబ్ పంత్. దీంతో ఏడాదికి పైగా ఆటకు దూరం అయ్యాడు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పంత్ ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో చోటు సంపాదించడమే లక్ష్యంగా తన కసరత్తులను మొదలుపెట్టాడు. ఈ క్రమ్రంలో ఐపీఎల్ 2024 సీజన్లో అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించనున్నాడు.
MS Dhoni : హుక్కా తాగింది ధోనినేనా..! ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియో సృష్టించారా..! ఏదీ నిజం..!
ప్రస్తుతం ఫిట్నెస్పై దృష్టి పెట్టిన ఈ డాషింగ్ హిట్టర్ ఐపీఎల్ 17వ సీజన్లో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కెప్టెన్గా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే.. ఈ ఏడాది జూన్లో జరిగే టీ20 వరల్డ్ కప్లో పంత్ ఆడతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.