Rohit Sharma – India vs Afghanistan : అఫ్గానిస్తాన్తో భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు మొదటి టీ20 మ్యాచులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే.. టాస్ అనంతరం తుది జట్టులో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి చోటు దక్కలేదో చెప్పాలంటూ వ్యాఖ్యాత మురళీ కార్తీక్ కెప్టెన్ రోహిత్ శర్మను కోరాడు.
రోహిత్ మాట్లాడుతూ.. టీమ్ కాంబినేషన్లో భాగంగా సంజు శాంసన్, అవేశ్ ఖాన్, గాయం కారణంగా యశస్వి జైస్వాల్ కు స్థానం దక్కలేదని చెప్పాడు. అయితే.. కుల్దీప్ యాదవ్ పేరును మర్చిపోయాడు. కుల్దీప్ పేరును గుర్తుతెచ్చుకునేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. మురళీ కార్తీక్ గుర్తు చేసిన తరువాత కుల్దీప్ పేరును రోహిత్ శర్మ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Asia Qualifiers 2024 : పారిస్ ఒలింపిక్స్కు బెర్తును ఖరారు చేసుకున్న రిథమ్ సాంగ్వాన్..
భారత తుది జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్
ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (29), ఇబ్రహీం జద్రాన్ (25), రహ్మానుల్లా గుర్బాజ్ (23) లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్లు చెరో రెండు వికెట్లు తీశారు. శివమ్ దూబె ఓ వికెట్ పడగొట్టాడు.
Typical Rohit Sharma moment during the toss😂#RohitSharma𓃵 #INDvsAFG pic.twitter.com/ntWUjdWF4t
— Quantum⁴⁵ Yadav (@45Quantum) January 11, 2024