Rohit Sharma Reacts on World Cup Schedule
Rohit Sharma Reacts on World Cup Schedule : పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ను ఐసీసీ (ICC) ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. రౌండ్-రాబిన్ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో లీగ్ దశలో టీమ్ఇండియా మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఆడనుంది. స్వదేశంలో ప్రపంచకప్ జరగనుండడంతో భారత్ విజయం సాధించాలని సగటు క్రీడాభిమాని కోరుకుంటున్నాడు. మూడో సారి, స్వదేశంలో రెండో సారి కపును సాధించడమే లక్ష్యంగా రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.
ICC World Cup 2023 : ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్కు వస్తే.. జరిగేది ఇదే..
వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ‘స్వదేశంలో ప్రపంచకప్ ఆడనుండడం గొప్ప అనుభూతి. 12 సంవత్సరాల క్రితం ఇండియా ప్రపంచకప్ను గెలిచింది. దీంతో ఈ సారి ఎలాగైన భారత్ ప్రపంచకప్ను గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆటలో చాలా మార్పులు రావడం, వేగంగా ఆడడంతో పాటు టీమ్లు సానుకూల ధృక్పథంతో ఆడతుండడంతో మ్యాచ్లు రసవత్తరంగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్-నవంబర్లో జరగనున్న ఈ టోర్నీ కోసం మేము సిద్ధం అవుతున్నాము. మా యొక్క అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తాం.’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
భారత్ తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆడనుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్లు అక్టోబర్ 15న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది.
Rishabh Pant : గ్యాంగ్ను కలవడం ఎప్పుడూ సంతోషమే.. పిక్ వైరల్
🗣️🗣️ We look forward to preparing well and being at our best this October-November #TeamIndia Captain @ImRo45 is all in readiness ahead of the #CWC23 👌👌 pic.twitter.com/ZlV8oNGJ04
— BCCI (@BCCI) June 27, 2023
ప్రపంచకప్లో టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే..
అక్టోబర్ 8: భారత్ vs ఆస్టేలియా (చెన్నై)
అక్టోబర్ 11: భారత్ vs అఫ్గానిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 15: భారత్ vs పాకిస్తాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్(పుణే)
అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2: భారత్ vs క్వాలిఫయర్2 (ముంబై)
నవంబర్ 5: భారత్ vs సౌతాఫ్రికా (కోల్కతా)
నవంబర్ 11: భారత్ vs క్వాలిఫయర్-1 (బెంగళూరు)
పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్కు చేరుకుంటాయి. మొదటి, నాలుగో స్థానంలో నిలిచిన జట్ల మధ్య నవంబర్ 15న ముంబైలోని వాంఖడే వేదికగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. సెమీఫైనల్స్ మరియు ఫైనల్ రెండింటికీ రిజర్వ్ డేలను ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ భారత్ సెమీఫైనల్కు అర్హత సాధిస్తే.. ఆ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది.