ఐపీఎల్ 2024 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్లో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే.. ఆదివారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన సహచర టీమ్ఇండియా ఆటగాడు అశ్విన్ పక్కన నిలుచోని ఎవరితోనే మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వెనక నుంచి వచ్చి రోహిత్ శర్మకు ముద్దు పెట్టబోయాడు. ఊహించని ఈ పరిణామంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు.
Sunil Narine : ఐపీఎల్లో సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర.. బుమ్రా బద్దలు కొట్టేనా?
బాండ్ ను చూసిన రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కాగా.. షేన్ బాండ్, రోహిత్ శర్మలకు మధ్య మంచి స్నేహబంధం ఉంది. రోహిత్ శర్మ ముంబై కెప్టెన్గా ఉన్నప్పుడు బాండ్ ఆ జట్టుకు బౌలింగ్ కోచ్గా పని చేశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాజస్థాన్ ఏడు మ్యాచులు ఆడగా ఆరింటిలో విజయం సాధించింది. 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై జట్టు ఏడు మ్యాచులు ఆడగా మూడింటిలో గెలుపొందింది. 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్ ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 15, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలుపొందాయి.
Some 𝘉𝘰𝘯𝘥𝘴 are priceless 💙🩷#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/s627hbYzuN
— Mumbai Indians (@mipaltan) April 21, 2024