Sreesanth : చెంప దెబ్బ ఘటన.. హర్భజన్కు కోటి ఆదాయం.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..
ఐపీఎల్ ఆరంభ సీజన్లో భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ ల (Sreesanth) మధ్య జరిగిన ఘటనను అభిమానులు ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు
- Thota Vamshi Kumar
- Updated on- April 25, 2026 / 12:42 PM IST
Sreesanth sensational allegations on Harbhajan Singh
- ఐపీఎల్ 2008 సీజన్ లో శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టిన హర్భజన్
- ఇటీవల ఈ ఘటనకు సంబంధించిన యాడ్ ద్వారా భజ్జీ రూ.కోటి సంపాదించినట్లు శ్రీశాంత్ ఆరోపణ
Sreesanth : 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్లో భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ ల మధ్య జరిగిన ఘటనను అభిమానులు ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్కు హర్భజన్ సింగ్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు శ్రీశాంత్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తరువాత ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో శ్రీశాంత్ చెంప పై హర్భజన్ సింగ్ కొట్టాడు. శ్రీశాంత్ మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన తరువాత భజ్జీ పై ఎనిమిది మ్యాచ్ల నిషేదం విధించారు.
ఇక ఈ ఘటన జరిగి 18 ఏళ్లు పూర్తైంది. ఇటీవల ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ దీని వీడియోను విడుదల చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ ఘటనను ఉపయోగించుకుని భజ్జీ కోటి రూపాయల లాభాన్ని పొందినట్లు ఆరోపించాడు.
ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. తాను హర్భజన్ గురించి గతంలో ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేనని చెప్పాడు. అప్పటి చెంప దెబ్బ ఘటనను తాను పట్టించుకోవడం మానేశానని తెలిపాడు. అయితే.. హర్భజన్ ఇటీవల ఈ ఘటన పై ఓ యాడ్ చేశాడని, దాని నుంచి అతడు 80 లక్షల నుంచి కోటి వరకు సంపాదించుకున్నాడని ఆరోపించాడు.
అక్కడితో భజ్జీ ఆగలేదన్నాడు. తనకు ఫోన్ చేసి మరీ ఆ యాడ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని కోరాడని చెప్పుకొచ్చాడు. తాను చేయనని చెప్పానని ఇంకా హర్భజన్తో ఇలా అన్నట్లు శ్రీశాంత్ తెలిపాడు. నేను నిన్ను క్షమిస్తాను. కానీ ఆ ఘటనను ఎన్నటికి మరిచిపోను అని చెప్పినట్లు వెల్లడించాడు. మీకు ఏదైన చెడు ఘటన జరిగితే దానికి బాధ్యులైన వారిని క్షమించాలి, కానీ ఆ చెడును మర్చిపోకూడదని శ్రీశాంత్ తెలిపాడు.
ఒకవేళ మరిచిపోతే అవతలి వ్యక్తి మళ్లీ అదే తప్పు చేయాలని చూస్తాడని అన్నాడు. ఇందుకు భజ్జీనే ఉదహరణ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అతడి ఇన్స్టాగ్రామ్ను బ్లాక్ చేశాను అని శ్రీకాంత్ తెలిపాడు.
