Team india cricketer Mohammed Siraj meets Telangana CM Revanth Reddy
Siraj meets CM Revanth Reddy : టీమ్ఇండియా సుదీర్ఘ విరామం తరువాత టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది. దాదాపు 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచకప్ను మరోసారి భారత్ అందుకుంది. భారత జట్టు విశ్వ విజేతగా నిలవడంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులతో పాటు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక భారత జట్టు విజయం సాధించడంలో తెలుగు ఆటగాడు మహమ్మద్ సిరాజ్ తన వంతు పాత్ర పోషించాడు. ప్రపంచకప్ ముగిసిన తరువాత హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే.. పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సీఎంకు సిరాజ్ టీమ్ఇండియా జెర్సీని బహూకరించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ సాధించినందుకు సిరాజ్ ను ముఖ్యమంత్రి అభినందించారు.
ICC Player of the Month : ఐసీసీ అవార్డుల్లో టీమ్ఇండియా ప్లేయర్ల హవా.. అటు మంధాన, ఇటు బుమ్రా..
హైదరాబాద్లో సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ పరిసరాల్లో స్థలం చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Team India cricketer Mohammed Siraj met CM Revanth Reddy.
సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.
టి 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ ను అభినందించిన ముఖ్యమంత్రి. టిం ఇండియా జెర్సీ ని సీఎం రేవంత్ రెడ్డి కి బహుకరించిన సిరాజ్.#RevanthReddy
•… pic.twitter.com/GGyUTGB9cB— Congress for Telangana (@Congress4TS) July 9, 2024
David Warner : రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ యూటర్న్..! ఇన్స్టాగ్రామ్లో సంచలన పోస్ట్..
ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు.