Team India’s T20 World Cup Squad: ఆస్ట్రేలియాలో ఈ నెల 16 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు బయలుదేరే భారత ఆటగాళ్లు ఫొటోలు దిగారు. బీసీసీఐతో పాటు ఆయా ఆటగాళ్లు ఈ ఫొటోలను ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ తమ ట్విటర్ ఖాతాల్లో ఆ ఫొటోలను పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి జట్లపై ఇటీవల టీ20 సిరీస్ లలో టీమిండియా వరుసగా విజయం సాధించింది.
అదే ఉత్సాహంతో టీ20 ప్రపంచ కప్ లో ఆడి విజయం సాధించాలన్న కసితో ఉంది. టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతూ ప్రపంచకప్ కు దూరమవుతున్నాడు. ఇటీవల ప్రాక్టీస్ సమయంలో మళ్ళీ వెన్నునొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.
అతడు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. టీ20 ప్రపంచకప్లో బుమ్రా ఆడే అవకాశం లేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. శార్దూల్ ఠాకూర్ ను కూడా గాయాలు వెంటాడుతున్నాయి. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. భారత జట్టు ఎలా ఆడుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుమ్రా లాంటి బౌలర్ల సేవలను కోల్పోవడం టీమిండియాకు గట్టి దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
En route Australia ✈️ Let’s do this ? pic.twitter.com/a3oLdbbDtb
— hardik pandya (@hardikpandya7) October 6, 2022
Australia bound ✈️. Exciting times ahead. ✌️ @yuzi_chahal @HarshalPatel23 pic.twitter.com/KtmertwefU
— Virat Kohli (@imVkohli) October 6, 2022
Cannot wait for the upcoming challenge. ??
???????. ???????. ??? ?? ?? ?????????. ? pic.twitter.com/jps1DX1vXH— Surya Kumar Yadav (@surya_14kumar) October 5, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..