ఆర్సీబీ మహిళా జట్టును అభినందిస్తూ విజయ్ మాల్యా ట్వీట్.. ఓ ఆటాడుకున్న నెటిజన్లు

ఆర్సీబీ మహిళా జట్టు ట్రోపీని గెలుచుకోవటంతో ఆ జట్టు మాజీ యాజమాని విజయ్ మాల్యా ఎక్స్ వేదికగా స్పందించాడు.

Vijay Mallya

WPL 2024 Title Winner RCB : మహిళల ప్రీమియర్ లీగ్ 2024 (డబ్ల్యూపీఎల్ 2024) టైటిల్ ను స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ మహిళా జట్టు గెలుచుకుంది. ఆర్సీబీకి ఇది చారిత్రాత్మకమైన విజయం. ఎందుకంటే.. ఐపీఎల్ లోని ఉమెన్స్ జట్టు పదహారేళ్లుగా టైటిల్ విజేతగా నిలవలేక పోయింది. డబ్ల్యూపీఎల్ లోని రెండో సీజన్ లోనే మహిళల జట్టు ఆ ఘనతను సాధించింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. బెంగళూరులోని యువత రాత్రివేళ రోడ్లపైకి వచ్చి డ్యాన్సులు చేస్తూ ఆర్సీసీ, ఆర్సీబీ అనే నినాదాలతో హోరెత్తించాయి.

Also Read : ఆర్సీబీ మహిళా జట్టు విజయంతో బెంగళూరు వీధుల్లో యువత సంబురాలు.. వీడియోలు వైరల్

ఆర్సీబీ మహిళా జట్టు ట్రోపీని గెలుచుకోవటంతో ఆ జట్టు మాజీ యాజమాని విజయ్ మాల్యా ఎక్స్ వేదికగా స్పందించాడు. డబ్ల్యూపీఎల్-2024 టైటిల్ గెలిచినందుకు ఆర్సీబీ మహిళా జట్టుకు హృదయపూర్వక అభినందనలు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ట్రోపీని ఆర్సీబీ పురుషుల జట్టు గెలిస్తే డబుల్ అద్భుతం అవుతుంది. గుడ్ లక్ అంటూ విజయ్ మాల్యా పేర్కొన్నారు. విజయ్ మాల్యా ట్వీట్ ను చూసిన నెటిజన్లు.. మీమ్స్ తో మండిపడుతున్నారు. మాల్యా.. ట్రోపీని తీసుకోవటానికి భారతదేశానికి రండి.. ఎవరూ ఏమీ అనరు అంటూ ఓ వినియోగదారుడు పేర్కొన్నాడు. మరో వినియోగదారుడు కోపంగా ఉన్న ఎమోజీతో.. డబ్బును వాపసు చేయి అని రాశాడు. అంతేకాక మరికొందరు నెటిజన్లు విజయ్ మాల్యా ట్వీట్ కు మీమ్స్ ను షేర్ చేస్తున్నారు.

Also Read : IPL 2024 : హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడడంపై ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు

 

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు