Virat Kohli Anushka Sharma invited for Pran Pratistha ceremony
Virat Kohli – Anushka Sharma : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రామ మందిర ఆహ్వానం అందింది. జనవరి 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రామానికి ఆహ్వానం అందుకున్న జాబితాలో విరాట్కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు చేరిపోయారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో బయటకు వచ్చింది. ఆహ్వానకార్డులతో విరుష్క జంట ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి ఆటగాళ్లకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. జనవరి 13న ముంబైలోని తన నివాసంలో టెండూల్కర్ ఆహ్వానం అందుకోగా, జనవరి 15న ధోని ఆహ్వానించబడ్డారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, చిరంజీవి వంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. సినీ, రాజకీయ, వివిధ రంగాలకు చెందిన దాదాపు 7000 వేల మంది ప్రముఖులకు పైగా ఆహ్వానాలు అందాయి.
ఇదిలా ఉంటే.. కోహ్లీ ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్లో బిజీగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టీ20 మ్యాచుకు అతడు హాజరు కాలేదు. రెండో టీ20 మ్యాచ్ ఆడాడు. 14 నెలల విరామం తరువాత టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ 16 బంతుల్లోనే 29 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.
Ajinkya Rahane : నా లక్ష్యమదే.. అజింక్యా రహానే భావోద్వేగం..!
Virat Kohli and Anushka Sharma have been invited for Pran Pratishtha of Lord Rama at Ram Temple in Ayodhya. pic.twitter.com/QhS71m4xy0
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 16, 2024