Buy Smartphone 2024 : మీరు స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? వచ్చే జూన్లోపు మీకు నచ్చిన స్మార్ట్ఫోన్ కొనేసుకోండి. ఎందుకంటే.. రాబోయే కొన్ని నెలల్లో భారత మార్కెట్లోస్మార్ట్ఫోన్ ధరలు ధరలు పెరిగే అవకాశం ఉంది. చైనా అధికారిక కరెన్సీని బలోపేతం చేయడంతోపాటు మెమరీ చిప్ల ధర పెరగడం వల్ల స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
స్మార్ట్ఫోన్ ధరల పెంపు ఎంత? :
మెమరీ చిప్ ధరల పెరుగుదల, చైనా అధికారిక కరెన్సీ బలోపేతం కావడం వంటి ఈ రెండు కారకాలే స్మార్ట్ఫోన్ ధరలు పెరగబోయేందుకు కారణం కావొచ్చు. నివేదిక ప్రకారం.. 10 శాతం నుంచి 15 శాతం పెంపుదలకి దారితీయవచ్చు.
స్మార్ట్ఫోన్లు ఎందుకు ఖరీదైనవి? :
మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ఫోర్స్ నివేదిక ప్రకారం.. రెండు కీలక సరఫరాదారుల్లో శాంసంగ్, మైక్రాన్ మార్చి నుంచి ధరల పెరుగుదలను అమలు చేసే అవకాశం ఉంది. డీఆర్ఏఎమ్ (మెమరీ చిప్స్) ధరలలో పెరుగుదల ఉండనుందని సూచించింది. దీని ప్రభావం స్మార్ట్ఫోన్ల ధరలపై పడనుంది. మెమరీ ధరల పెరుగుదల దాదాపు 15 శాతానికి చేరుకోవచ్చునని, చివరికి స్మార్ట్ఫోన్ ధరల పెరుగుదలకు దారితీస్తుందని నివేదిక పేర్కొంది.
దిగుమతి సుంకం, పన్ను తగ్గింపు ధరలు తగ్గుతాయా? :
మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకం పన్నును ఇటీవల తగ్గించడం ద్వారా ధరల పెంపుతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభిస్తుంది. మధ్యంతర బడ్జెట్కు ముందు జనవరి 31న మొబైల్ తయారీలో ఉపయోగించే కీలక భాగాలపై దిగుమతి సుంకాలను ప్రభుత్వం తగ్గించింది. దీని ఫలితంగా మొబైల్ తయారీకి కీలకమైన వివిధ భాగాలపై దిగుమతి సుంకం తగ్గింది.
ఈ అంచనాలు ఎంత కచ్చితమైనవి? :
ఈ అంచనాలు ప్రస్తుత ట్రెండ్ల ఆధారంగా ఉంటాయి. ధరల పెంపు జరుగుతుందో లేదో చూడాలి. నివేదిక ప్రకారం.. చాలా మంది భారతీయ వినియోగదారులకు షాక్ ఇవ్వవచ్చు. మెమరీ ధరల పెరుగుదల, చైనీస్ యువాన్ మెరుగైన స్థానం కారణంగా ఈ ఏడాదిలో జూన్ నుంచి దేశంలో స్మార్ట్ఫోన్ ధరలు పెరగవచ్చు.
మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్ఫోర్స్ నుంచి డేటాను డీఆర్ఏఎమ్ (మెమరీ చిప్) ధరలలో పెరుగుదల ఉందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. కనీసం రెండు ప్రధాన సరఫరాదారులు శాంసంగ్, మైక్రాన్ మార్చిలో ధరలను 15 నుంచి 20శాతం పెంచాలని చూస్తున్నాయి. త్రైమాసికంలో స్మార్ట్ఫోన్, పీసీ మార్కెట్లలో క్రమంగా పుంజుకోవడంతో పాటు ఏఐ వేగవంతమైన స్వీకరణ కారణంగా సరఫరా పరిమితుల కారణంగా ధరల పెంపు ఉండవచ్చు.
ఫిబ్రవరి మూడో వారం నుంచి మార్చి మొదటి వారం వరకు అధిక డిమాండ్ కారణంగా 10 నుంచి 15శాతం రేంజ్లో మెమరీ ధరలలో పెరుగుదలను అంచనా వేస్తోంది. ఇదే జరిగితే.. ప్రతి ఒక్కరూ ధరలను పెంచవలసి ఉంటుంది. ఇటీవలి డ్యూటీ కోతలు కొంతవరకు ప్రభావాన్ని రద్దు చేయడంలో సాయపడతాయని ట్రెండ్ఫోర్స్ విశ్లేషణను ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. రాబోయే ధరల పెంపు ప్రభావం వచ్చే త్రైమాసికం నుంచి అమల్లోకి రానుందని స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీ పేర్కొంది.
మెమరీ చిప్ ధర ఎంత పెరగొచ్చుంటే? :
ఎందుకంటే చాలా కంపెనీలు ప్రస్తుతం మార్చి త్రైమాసికంలో ఉత్పత్తులను సరఫరా చేయడానికి అవసరమైన పరికరాలను కలిగి ఉన్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి లేదా మార్చి ప్రారంభంలో మెమరీ చిప్ల ధర దాదాపు 10 శాతం నుంచి 15శాతం పెరగవచ్చునని నివేదిక పేర్కొంది. అయితే ఇటీవలి పన్ను తగ్గింపులు భారత మార్కెట్లో ధరల పెరుగుదల ప్రభావాన్ని రద్దు చేయడంలో సాయపడతాయి.
ఇటీవల, కేంద్ర ప్రభుత్వం బ్యాటరీ కవర్లు, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, యాంటెన్నా, సిమ్ సాకెట్లు, ఇతర మెకానికల్ వస్తువులతో సహా మొబైల్ ఫోన్ తయారీకి ఉపయోగించే కీలక భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, బ్రాండ్లు తమ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచకపోవచ్చని, దానికి బదులుగా బడ్జెట్ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో తక్కువ మెమరీ, స్టోరేజ్ను అందించడం ప్రారంభించవచ్చని నివేదిక హెచ్చరించింది. నివేదిక ప్రకారం.. మెమరీ చిప్ల ధర పెరుగుదల భారత మార్కెట్లో 5జీ టెక్నాలజీని నెమ్మదిగా స్వీకరించడానికి దారితీయవచ్చు.