అంతమాట అంటారా? తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు: అద్దంకి దయాకర్

ఆంధ్రోళ్ల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే తాను తీస్తానని కేసీఆర్ అన్నారని..

Addanki Dayakar

తెలంగాణ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారంపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. అరికెపూడి గాంధీని పాడి కౌశిక్ రెడ్డి ఆంధ్రోడు అన్న వ్యాఖ్యలకు నవ్వొస్తుందని చెప్పారు. పదేళ్లపాటు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లోనే ఉన్నారని, మరి అప్పుడు ఎందుకు అనలేదని ప్రశ్నించారు.

కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించాలని, లేదంటే కేసీఆర్ కౌశిక్ రెడ్డితో అలా మాట్లాడించారని అందరూ అనుకుంటారని చెప్పారు. సెంటిమెంట్‌ను వాడుకుని పబ్బం గడుపుకున్న వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. ఆంధ్రోళ్ల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే తాను తీస్తానని కేసీఆర్ అన్నారని చెప్పారు. ఓట్ల కోసం కేసీఆర్ ఆంధ్రోళ్లను వాడుకున్నారని, ఇప్పుడు వాళ్ల అవసరం లేదని ఆంధ్రోళ్లు అని అంటున్నారని తెలిపారు.

ఆంధ్రా సెటిలర్స్ అంటారా?: ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆంధ్రా సెటిలర్స్ బతకడానికి వచ్చారని అవమానించేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని చెప్పారు. ఆంధ్రా వాళ్ల ఓట్లు, సీట్లు చివరకు నోట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి కావాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్లు బీఆర్ఎస్ పరువు కాపాడారని చెప్పారు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఆంధ్రా సెటిలర్స్ బతకడానికి హైదరాబాద్ వచ్చారని మాట్లాడుతున్నారని అన్నారు.

Also Read: ఇది హేయమైన చర్య.. వారిద్దరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలి: మందకృష్ణ మాదిగ

ట్రెండింగ్ వార్తలు