Uttam Kumar Reddy
Uttam Kumar Reddy : స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ తరహాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎండకు ఎండి వానకు తడిసి 600 కిలోమీటర్లు నిరంతరంగా నడిచి పాదయాత్ర పూర్తి చేసుకున్న భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. పోరాటాల చరిత్ర కలిగిన విప్లవాల జిల్లా భువనగిరిలో భట్టి విక్రమార్క పాదయాత్ర 600 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకం అని అన్నారు.
భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భట్టి విక్రమార్కకి అభినందనలు చెప్పమని తనకు చెప్పారని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాలకు వెళ్లినందున భట్టి పాదయాత్రకు రాలేకపోయారని తెలిపారు. 40 నియోజకవర్గాల్లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఉన్నారని పేర్కొన్నారు. బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు.
Uttam Kumar Reddy: కేసీఆర్కు బీజేపీతో రహస్య ఒప్పందం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడకుండా కార్యకర్తలు కాంగ్రెస్ ను నిలబెడుతున్నారని కొనియాడారు. బీబీనగర్ లో ఎయిమ్స్ పూర్తి చేయాలని పార్లమెంటు సాక్షిగా గత నాలుగు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని చెప్పారు. బీబీనగర్ ఏయిమ్స్ కు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు రూ.28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని కేంద్రం పార్లమెంటులో నిస్సిగ్గుగా సమాధానం చెప్పిందన్నారు.
నత్త నడకన ఎయిమ్స్ పనులు సాగుతున్నప్పటికీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పనులు చేయడం లేదని విమర్శించారు. ఎయిమ్స్ పూర్తి చేయని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. రూ.42 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు కమీషన్ల కక్కుర్తి కోసమేనని ఆరోపించారు. తెలంగాణలో ఏ ఇంటికెళ్లినా మిషన్ భగీరథ ద్వారా ప్యూరిఫైడ్ నీరు రావడం లేదని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు.
Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంచినీళ్ల కోసం అనేక గ్రామాల్లో ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య జటిలంగా మారిందన్నారు. రూ.40 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు కొలువులు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికి మే8న సరూర్ నగర్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతున్నారని తెలిపారు.
ఈ బహిరంగ సభకు నిరుద్యోగులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2023 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు భువనగిరి మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.