Krishank : చంచ‌ల్‌గూడ జైలు నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్ లెటర్

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జి క్రిశాంక్‌ను మే1న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పంతంగి చెక్‌పోస్టు వద్ద ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Krishank : చంచ‌ల్‌గూడ జైలు నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్ లేఖను విడుదల చేశారు. నా అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడినందుకు బీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు నాకు మద్దతుగా నిలిచి నాలో ధైర్యాన్ని నింపారు. నాకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులందరికీ, దీనిని కవర్ చేస్తున్న జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు. నా పోరాటం కొనసాగుతుంది. ఓయూ ఒరిజినల్ సర్క్యులర్ ని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. నా లెటర్ ఫోర్జరీ అని రుజువైతే ఎలాంటి శిక్షను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి నకిలీ లెటర్ పోస్ట్ చేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని క్రిశాంక్ లేఖలో పేర్కొన్నారు.

Also Read : Krishank: పంతంగి చెక్‌పోస్టు వద్ద బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జి క్రిశాంక్‌ను మే1న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పంతంగి చెక్‌పోస్టు వద్ద ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఈస్ట్ మారేడ్ పల్లిలోని జడ్జి ముందు హాజరు పర్చారు. న్యాయమూర్తి క్రిశాంక్ కు 14రోజులు పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో క్రిశాంక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఉస్మానియా యూనివర్శిటీలో నీరు, కరెంట్ సమస్యపై నకిలీ నోటీసులు సృష్టించి వర్శిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఓయూ చీఫ్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిశాంక్ పై ఓయూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు