Road Accident : లారీని ఢీకొన్న పెళ్లి బృందం బస్సు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెండ్లి బృందం బస్సు, ఆగి ఉన్న లారీని ఢీకొంది.
- kunduru Vinod
- Published On : November 24, 2021 / 03:01 PM IST
Road Accident
Road Accident : మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెండ్లి బృందం బస్సు, ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి : Accident : షాకింగ్ యాక్సిడెంట్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇప్పటివరకు చూసి ఉండరు..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కన్నెపల్లి మండలం టేకులపల్లి నుంచి మందమర్రి మండల పరిధిలోని బొక్కలగుట్ట గ్రామానికి పెండ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. స్థానిక పాతబస్టాండ్ చౌరస్తా సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది.
చదవండి : Auto Accident : ఆటో బోల్తా..8మంది విద్యార్థులకు తీవ్రగాయాలు..ముగ్గురి పరిస్థితి విషమం..
ఈ సమాయంలో బస్సు వేగం తగ్గువగా ఉండటంతో ఎవరికి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది.
