CM Revanth Reddy : అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలు : సీఎం రేవంత్ రెడ్డి హామీ

CM Revanth Reddy : జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక రోడ్డుమ్యాప్‌తో వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని సీఎం రేవంత్ హమీ ఇచ్చారు.

CM Revanth Reddy Assures Journalists Over Housing Lands in Telangana

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీ (జేఎన్‌జే)కి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవిన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డితో జేఎన్‌జే ప్రతినిధులు చర్చించి ఒక రోడ్డుమ్యాప్‌తో వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్‌ ఛైర్మన్‌ నియమించకుండా కేవలం మీడియా అకాడమీకే శ్రీనివాసరెడ్డిని ఛైర్మన్‌గా నియమించామని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోందన్నారు.

Read Also : Harish Rao Comments : అందుకే కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నారు : హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

సీఎంకు కృతఙ్ఞతలు తెలిపిన జేఎన్‌జే : 
శుక్రవారం సాయంత్రం జేఎన్‌జేలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ మీడియాకు చెందిన ప్రధాన ప్రతినిధులు సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలిశారు. జేఎన్‌జేకు కేటాయించిన ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ వంద రోజుల్లోగా మొదలుపెడతానన్న హమీని అమలు చేసినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. సొసైటీ ప్రస్థానం గురించి జేఎన్‌జే ‌ ప్రతినిధులు సీఎంకు వివరించారు. 16 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ ప్రభుత్వమే నిజాంపేట, పేట్‌బషీర్‌బాద్‌లో 70 ఎకరాల స్థలాన్ని జేఎన్‌జేకు కేటాయించిదని తెలిపారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సొసైటీకి స్థలాన్ని అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వంలో ఈ తీర్పు అమలుకాలేదన్నారు. ఇప్పటివరకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామన్నారు.

సీఎం ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఈ సొసైటీలోని 60 మంది సభ్యులు ఇప్పటికే మరణించారని.. మరో 20 మంది సభ్యుల ఆరోగ్య పరిస్థితి బాలేదని ఆయన సీఎంకు వివరించారు. సొసైటీ సభ్యులు మరణించడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఎమ్మెల్యే సొసైటీలో తానూ సభ్యుడినని అభివృద్ధి కోసం 10 లక్షలు చెల్లించానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన మిగిలిన జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇచ్చే విషయంలోనూ మీడియా అకాడామీతో చర్చించి కార్యారణను రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామని పేర్కొన్నారు.

జర్నలిస్టుల ఆరోగ్యభద్రతా కార్డులతోపాటు ఇతర సమస్యలపై కూడా దృష్టిసారించామని తెలిపారు. ఈ సమావేశంలో రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేంద్రరెడ్డి కూడా పాల్గొన్నారు.

Read Also : YCP 9th List : వైసీపీ 9వ జాబితా విడుదల.. ఒక పార్లమెంట్, 2 అసెంబ్లీలకు కొత్త ఇంచార్జులు

ట్రెండింగ్ వార్తలు