Mahalakshmi Scheme: ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం చేసిన మహిళలతో మాట్లాడినా జగ్గారెడ్డి

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు ఆర్టీసి బస్ ఎక్కి జగ్గారెడ్డి ప్రయాణం చేశారు. ఉచిత టికెట్ మీద మహిళల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు

మహాలక్ష్మీ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ఉచిత టికెట్ మీద ప్రయాణిస్తున్న మహిళలతో మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడారు. జీవితంలో కాంగ్రెస్ పార్టీని మరవకండంటూ మహిళలకు సూచించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ మాట ఇచ్చిన్నట్లే ఈ రోజు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసి బస్సులో మహిళలకు టికెట్ లేకుండా ఉచితంగా మొదలు పెట్టినట్లు ఆయన చెప్పారు.

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు ఆర్టీసి బస్ ఎక్కి జగ్గారెడ్డి ప్రయాణం చేశారు. ఉచిత టికెట్ మీద మహిళల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు. టికెట్ లేకుండా ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. చాలా అందంగా ఉందని జగ్గారెడ్డితో మహిళలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని, గృహిణి మహిళలకు కూడా త్వరలో 2500 రూపాయలు ఇస్తామని, ఎన్నికలో చెప్పిన్నట్లే కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలు అమలు చేస్తుందని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు