KCR
KCR Farm House : సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్హౌస్ను కాంగ్రెస్ పార్టీ నేతలు ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ నాకులు, కార్యకర్తలు ఫామ్ హౌస్ వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు.
గజ్వేల్ ప్రాంత సమస్యలను మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ పట్టించుకోవడంలేదని ఫ్ల కార్డులతో ఫామ్ హౌస్ ముందు కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. గజ్వేల్ ప్రాంత సమస్యలను పట్టించుకోని కేసీఆర్ మాకొద్దు మాకొద్దు అంటూ ఫామ్హౌస్ గేటు ముందు నిరసనకు దిగారు.
ALso Read: తెలంగాణకు అసలు విలన్ ఆ పార్టీనే.. కేసీఆర్ తొలి నుంచి చెబుతున్న మాటలు అక్షరసత్యం అయ్యాయి.. హరీశ్ రావు