Telangana Bjp President : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. నేతల మధ్య ఏకాభిప్రాయం కోసం అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. దశలవారిగా నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రామచందర్ రావు, మనోహర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఉన్నారు.
ఈటలకే పగ్గాలు ఇవ్వాలని కొందరు నేతలు ప్రతిపాదించారు. అయితే, బీజేపీలో మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని మరికొందరు చెబుతున్నారు. దీంతో నేతల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్ రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : విలీన ప్రచారం అబద్ధమని చెప్పుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ నేతల తంటా