fake news: తెలంగాణ కాంగ్రెస్ బృందం కాసేపట్లో డీజీపీని కలవనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ కానున్నారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. 10టీవీ లోగో వాడుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేశారని.. పోలింగ్ ప్రారంభమైన తర్వాతే ఫేక్ న్యూస్ ప్రచారంలోకి తెచ్చారని ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఫేక్ న్యూస్పై ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ అన్నారు.
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి తిరిగి టీఆర్ఎస్ లోకి వచ్చేశారని టెన్ టీవీ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది టెన్ టీవీ. అటు అసత్య ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి. ఇది టీఆర్ఎస్, బీజేపీ పనే అని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
ఓటు వేసిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు:
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిట్టాపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొగుట మండలం తుక్కాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి.. బొప్పాపూర్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వీరి మధ్యనే నెలకొంది.