Harish Rao Comments : అందుకే కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నారు : హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao Comments : రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తే మేము ఊరుకోనేది లేదన్నారు. మేడిగడ్డ తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించిన సమస్య.. మేడిగడ్డను వెంటనే రిపేర్ చేసి వానాకాలం లోపు రైతులకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Harish Rao Reveals Facts About Kaleshwara Project

Harish Rao Comments : బీఆర్‌ఎస్‌ను పడగొట్టెందుకు.. కాళేశ్వరం పడగొట్టే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నారని, అందుకే కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యత గల ప్రభుత్వంగా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.

Read Also : KTR: మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. ఉద్రిక్తత

లేదంటే.. అఖిల పక్షం పిలవాలని, తామే సూచనలు చేస్తామని చెప్పారు. రాజకీయాలకు ఇది సమయం కాదని హితవు పలికారు. రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తే మేము ఊరుకోనేది లేదన్నారు. మేడిగడ్డ తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించిన సమస్య గా హరీశ్ రావు పేర్కొన్నారు. మేడిగడ్డను వెంటనే రిపేర్ చేసి వానాకాలం లోపు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు కలిగితే కేసీఆర్ ఊరుకోడని హరీష్ రావు హెచ్చరించారు.

మేడిగడ్డ రిపేరు చేసి రైతులను ఆదుకోవాలి :
మేడి గడ్డకు వెళ్తున్నాం అంటేనే కాంగ్రెస్ పోటీ యాత్రలు చేస్తుందని మండిపడ్డారు. నల్గొండలో సభతో కృష్ణ జలాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. మేడి గడ్డ రిపేర్ చేస్తామని ఉత్తమ కుమార్ చెప్పారంటే బీఆర్ఎస్ యాత్ర సక్సెస్ అయినట్టేనన్నారు. గత ప్రభుత్వాలను బద్నాం చేయాలనేది తప్ప వేరే కనిపించడం లేదని మాజీ మంత్రి దుయ్యబట్టారు. గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం వంద కంపోనెంట్లలో మేడి గడ్డ ఒకటని, మూడు పిల్లర్లు కుంగితె ప్రాజెక్ట్ మొత్తం వ్యర్దం అయిందని అనడం దారుణమన్నారు. రానున్న వానాకాలం లోపే మేడిగడ్డ రిపేరు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

జన యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారు :
రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్న ఆయన వానాకాలం లోపు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డికి లేదని, కనీసం పరిపాలనలో అయిన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగినంత అవినీతి ఎన్నడూ జరగలేదని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశారు. జనయజ్ఞాన్ని దన యజ్ఞంగా మార్చింది ఆనాటి కాంగ్రెస్ అంటూ విమర్శించారు. ఏడేళ్లు వృథా చేశారని, కానీ ప్రాజెక్టు నిర్మాణం మాత్రం చేయలేదని మండిపడ్డారు. నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ అంటూ హరీశ్ రావు మరోసారి గుర్తు చేశారు. ప్రతిపాదిత జీవోతో ఒక్క ప్రాజెక్ట్ అయిన పూర్తి అయిందో చెప్పాలన్నారు. కాళేశ్వరం కనీసం రెండు రెట్లు కూడా అంచనా పెరగలేదని చెప్పారు.

కాళేశ్వరంతో 200 శాతం మత్స సంపద పెరిగింది :
ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజం అవుతుందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారని, కాళేశ్వరంతో 200 శాతం మత్స సంపద పెరిగిందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు, చెరువులకు అనుసంధానం చేసింది కేసీఆర్ అన్న ఆయన 40 ఏళ్లలో చేసిన ఆయకట్టును నాలుగేళ్లలో చేసి చూపించామన్నారు. ఇప్పుడు, సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు పాలమూరు పర్యటన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకు పోయాయని, కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కట్టిన పోలవరం కొట్టుకుపోయింది నిజం కాదా ? అని ప్రశ్నించారు.

పోలవరం కొట్టుకుపోయి ఐదేళ్లు అయిన ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ రాలేదని, కానీ మేడిగడ్డకు రెండు రోజులకే రిపోర్ట్ వచ్చిందన్నారు. జరిగిన దాని మీద విచారణ చేసి దోషులను శిక్షించండి కానీ కాలయాపన చేసి రైతులను మోసం చేయద్దని చెప్పారు. మేడిగడ్డను వెంటనే రిపేర్ చేసి వానాకాలం లోపు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Read Also : అందుకే జనసేనకు రాజీనామా చేసి.. వైసీపీలో చేరాను: చేగొండి సూర్యప్రకాశ్

ట్రెండింగ్ వార్తలు