Tank Bund Ganesh Visarjan: ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై సస్పెన్స్.. భక్తుల ఆగ్రహం!
వినాయక చవితి ఉత్సవాల వేళ హుస్సేన్సాగర్(Tank Bund Ganesh Visarjan) ల్లో నిమజ్జనాలపై విధించిన ఆంక్షలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.
- V Santhosh Kumar
- Published on- September 17, 2026 / 12:56 PM IST
Hyderabad tank bund ganesh visarjan restrictions controversy
- ట్యాంక్ బండ్ బంద్
- ఖైరతాబాద్పై తీవ్ర ఉత్కంఠ
- భక్తుల తీవ్ర నిరసనలు
Tank Bund Ganesh Visarjan: హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాల వేళ హుస్సేన్సాగర్ (ట్యాంక్ బండ్) పరిసరాల్లో నిమజ్జనాలపై విధించిన ఆంక్షలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సరస్సు కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ట్యాంక్ బండ్పై భారీ విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం భాగ్యనగరంలో గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు, ప్రభుత్వం మధ్య పెద్ద ఎత్తున చర్చకు, నిరసనలకు వేదికగా మారింది.
AP Government: ఇకపై నివాస ధ్రువీకరణ పత్రాలు అక్కడే తీసుకోవాలి.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
పర్యావరణ నిబంధనలు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు:
తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (Tank Bund Ganesh Visarjan) విగ్రహాల నిమజ్జనం వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సరస్సును రక్షించేందుకు నగరం నలుమూలలా కృత్రిమ నిమజ్జన కొలనులను ఏర్పాటు చేశారు. చిన్న, మీడియం విగ్రహాలను మాత్రమే వీటిలో నిమజ్జనం చేయాలని, ట్యాంక్ బండ్ వైపు వాహనాలను అనుమతించబోమని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఖైరతాబాద్ గణేష్ సహా ప్రముఖ విగ్రహాల నిమజ్జనంపై సస్పెన్స్:
తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్, చిక్కడపల్లి, కాచిగూడ వంటి ప్రముఖ మండపాల భారీ విగ్రహాల నిమజ్జనంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతి ఏటా అత్యంత వైభవంగా సాగే ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర, ఎన్టీఆర్ మార్గ్ లేదా ట్యాంక్ బండ్ వద్దే పూర్తవుతుంది. కృత్రిమ కొలనులు ఇటువంటి భారీ విగ్రహాలకు ఏమాత్రం సరిపోవని, సాంప్రదాయం ప్రకారం హుస్సేన్సాగర్లోనే నిమజ్జనం చేయడానికి అనుమతించాలని భక్తులు, నిర్వాహకులు భీష్మించుకుకూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
