Harish Rao : కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ మాయం.. తెలంగాణ కుక్కలు చింపిన విస్తరాకే : మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్ సభల్లో జన సునామీ కనిపిస్తుందని, కాంగ్రెస్ వాళ్ల మీటింగ్ లకు మాత్రం జనాలు రావడం లేదని అన్నారు. 80 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Minister Harish Rao (7)

Harish Rao – Congress : కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ మాయమవుతుందని, తెలంగాణ కుక్కలు చింపిన విస్తరాకు అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ రాక అన్నదాతలు ఆగమయ్యారని తెలిపారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారం మండలం చికటిమామిడి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత గెలుపు కోరుతూ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రేవంత్ పాగల్ లాగా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్ మూడు గంటలు కరెంట్ చాలు అంటున్నాడని తెలిపారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ మళ్ళీ కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపెట్టాడని, 5 గంటలు కరెంట్ ఇస్తామని కుండ బద్దలు కొట్టాడని వెల్లడించారు. కర్ణాటక ప్రజలు ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని బంద్ చేశారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ , ప్రియాంకా గాంధీలు కూడా ఇక్కడికి వచ్చి పచ్చి అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు.

Kodali Nani : చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి గుడివాడ అభివృద్ధికి ఏం చేశాడు? : కొడాలి నాని

కాంగ్రెస్ వాళ్ళది సుతి లేని సంసారం లాంటిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సభల్లో జన సునామీ కనిపిస్తుందని, కాంగ్రెస్ వాళ్ల మీటింగ్ లకు మాత్రం జనాలు రావడం లేదని అన్నారు. 80 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కొండ పోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను ఆలేరు నియోజకవర్గంలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎండా కాలంలో కూడా చెరువుల మత్తడి దుంకుతున్నాయని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు