KA Paul : రేవంత్ రెడ్డి గెలుపుపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

అంజన్ కుమార్ ని రేవంత్ చీఫ్ అడ్వైజర్ గా నియమించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వెల్లడించారు.

KA PAUL (1)

KA Paul – Revanth Reddy : రేవంత్ రెడ్డి గెలుపుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు మార్చకుండా తాను చీఫ్ ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి తేవడం వల్లే రేవంత్ రెడ్డి గెలిచాడని పేర్కొన్నారు. అంజన్ కుమార్ ఈవీఎంలు మార్చుకుండా స్ట్రిక్ట్ గా వ్యవహరించాడని, అందుకే ఆయనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. మాజీ డీజీపీ అంజన్ కుమార్ లాంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంజన్ కుమార్ ని రేవంత్ చీఫ్ అడ్వైజర్ గా నియమించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని అనుకున్నారని తెలిపారు. తెలంగాణలో జనసేనాకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.

Chandrababu : అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం.. ఏపీలో కూడా అదే చూస్తాం : చంద్రబాబు

పవన్ కళ్యాణ్ కు విశాఖపట్నంలో ఏమి పని అని ప్రశ్నించచారు. ఈ దొంగల్ని, ప్యాకేజి స్టార్ లను నమ్మొద్దని పిలుపునిచ్చారు. మన ప్రాంతం వచ్చి, మన భూములను దోచుకుంటున్నారని, తాను లేకపోతే స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని అమ్మేసేవారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు