KTR: మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. ఉద్రిక్తత

KTR: రాజకీయంగా కోపం ఉంటే తమ మీద తీర్చుకోవాలని అన్నారు.

Medigadda

మేడిగడ్డ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బ్యారేజ్ మెయిన్ గేట్‌ను తోసుకుని కార్యకర్తలు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.

మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయంగా కోపం ఉంటే తమ మీద తీర్చుకోవాలని అన్నారు. నిపుణుల సూచనల మేరకు రిపేర్ చేయాలని చెప్పారు. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల మీద పగ పట్టకూడదని హితవు పలికారు. వచ్చే వర్షా కాలం నాటికి రిపేర్ చేసి నీరందించాలని అన్నారు.

మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తారు. అన్నారం బ్యారేజ్ వద్ద హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పి కొడతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెబుతుతున్నారు. మరమ్మత్తులు చేయాల్సింది పోయి.. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని చెప్పారు.

Also Read: కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన ప్రమాదం

ట్రెండింగ్ వార్తలు