×
Ad

Mayawati : బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ : మాయావతి

బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిందన్నారు.

  • Published On : November 23, 2023 / 02:58 PM IST

Mayawati, RS Praveen Kumar

BSP Chief Mayawati : తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రాగానే భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో గురువారం నిర్వహించిన సభలో మాయావతి పాల్గొని, ప్రసంగించారు.

అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్ లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని అన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి బిఎస్పీ ని గెలిపించాలని కోరారు. మండల్ కమిషన్ ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు.

Also Read : పండిన ప్రతి గింజను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిందన్నారు. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామని తెలిపారు. కాగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.