Hyderabad : శ్రీరామ నవమి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయించితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.