200 ICU beds sanctioned for NIMS Hospital : హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్ మంజూరు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రానున్న 30 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 45 రోజుల్లో 120 కొత్త వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రొబెటిక్ సర్జరీలకు పరికరాల కోసం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ కు మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రాబోతున్నాయని వెల్లడించారు. నిమ్స్ లో గైనిక్ వింగ్ పెట్టాలనే వినతి వచ్చిందని..200 బెడ్స్ తో గైనిక్ విభాగానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని స్పష్ట చేశారు.
Fake Visas : శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం..40 మంది మహిళలు అరెస్టు
కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పూర్తికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందరూ మాస్కులు ధరించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.