Vande Bharat Express Theft : వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు దొంగల బెడద.. వృద్ధురాలి నుంచి హ్యాండ్ బ్యాగ్ చోరీ
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు నెక్లెస్ తీసుకెళ్తున్న విషయాన్ని పసిగట్టి పథకం ప్రకారమే చోరీ ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
- bheemraj
- Published On : June 17, 2023 / 06:37 PM IST
Vande Bharat Express
Woman Handbag Stolen : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ చోరీ జరిగింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు దొంగల బెడద తప్పటం లేదు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్న ఓ వృద్ధురాలి హ్యాండ్ బ్యాగ్ చోరికి గురైంది.
60 లక్షల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ ఉన్న బ్యాగ్ ను దొంగలు దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు నెక్లెస్ తీసుకెళ్తున్న విషయాన్ని పసిగట్టి పథకం ప్రకారమే చోరీ ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
