Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల(Rain Alert) పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
- V Santhosh Kumar
- Published on- July 27, 2026 / 06:34 AM IST
Telangana andhra pradesh weather update rain and thunderstorm warning
- రానున్న మూడు రోజులు వర్షాలు
- ఈదురుగాలులతో తీవ్ర పిడుగుల హెచ్చరిక
- రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Rain Alert: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించిన సమాచారం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు ఉధృతమయ్యే అవకాశముంది. తుఫాను తరహా ఈదురుగాలులు గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున, గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చి, ఉష్ణోగ్రతలను తగ్గించనున్నాయి.
చెదరుమదరు వర్షాలు & పిడుగుల హెచ్చరిక:
ఆంధ్రప్రదేశ్లో రానున్న డెబ్బై రెండు గంటల వ్యవధిలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా కాకుండా చెదరుమదరుగా జల్లులు(Rain Alert) పడే అవకాశముంది. అయితే, రాయలసీమ ప్రాంతంలో పిడుగులు పడే తీవ్ర ముప్పు ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో గొర్రెల కాపరులు, రైతులు, సామాన్య ప్రజలు ఆరుబయట లేదా చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం కూడా ఉందన్నారు.
చల్లని గాలులు, రైతులకు వాతావరణ శాఖ సూచనలు:
తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు ఆకాశం నిలకడగా మేఘావృతమై ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడవచ్చు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. వర్షపాతం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, రైతులు తమ విత్తనాలు చల్లే పనులు, ఎరువుల పిచికారీ విషయంలో స్థానిక వాతావరణ నివేదికలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
