నేను ఏం మోసం చేశా..? నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావ్.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై సబిత ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత వ్యాఖ్యలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను..

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy Emotional Speech In Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధ తారాస్థాయికి చేరింది. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడు సభకేరారు.. కేటీఆర్ మాత్రం ప్రభుత్వానికి సహకరిస్తామంటే ఎలా నమ్మాలి? అంటూ ప్రశ్నించారు. ఆ అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది అంటూ సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రేవంత్ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Also Read : నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చా..! కేసీఆర్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ సెటైర్లు..

ఒక తమ్ముడుగా రేవంత్ రెడ్డిని ఆశీర్వదించాను. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. సీఎం స్థాయికి వెళ్తావ్ అని నేను ఆశీర్వదించాను. కానీ, ఆయన నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నన్ను ఎందుకు అవమానిస్తున్నావ్.. నేను ఏం తప్పు చేశా? నేను ఏం మోసం చేశా అంటూ రేవంత్ రెడ్డిని సబిత ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డను ఎందుకు అవమానిస్తున్నావ్.. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి.. నాఇంటిపై వాలడానికి వీలులేదని చెప్పారు.. ఈ రోజు ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిని సభితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

Also Read : మీ పదేళ్ల పాలన కోటా శ్రీనివాసరావు కోడి కథలా ఉంది.. అసెంబ్లీలో కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్..

సబిత ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టింది. నువ్వు కాంగ్రెస్ లోకి వస్తే ముఖ్యమంత్రివి అవుతావని సబితక్క నాకు చెప్పింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. నేను చెప్పే మాట నిజమా కాదా సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి. గవర్నర్ ను రిసివ్ చేసుకొని తిరిగి వచ్చి అందరికీ సమాధానం చెప్తానని రేవంత్ రెడ్డి అన్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఒక దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీలో సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే టీఆర్ఎస్ లోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ నన్ను సీఎల్పీ లీడర్ ను చేస్తే నా వెనక ఉండాల్సింది పోయి పదవికోసం ఆమె పార్టీ మారింది. ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసేందుకు ఆమె పార్టీ మారారు. పార్టీలు మారి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందిగాక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు అంటూ సబితా ఇంద్రారెడ్డిపై భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అసలు సబిత ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.

 

ట్రెండింగ్ వార్తలు