Lockdown Telangana: లాక్డౌన్ తొలిగిపోనుందా? తెలంగాణ అత్యవసర కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేపటితో లాక్డౌన్ ముగియనుండగా.. లాక్డౌన్పై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు సీజనల్ వ్యాధులు, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వర్షపాతం, వానాకాలం సాగు, సాగు సంబంధిత అంశాలు, గోదావరిలో నీటి ఎత్తిపోత, జల విద్యుత్ ఉత్పత్తిపై కూడా చర్చించనున్నారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ క్రమంలోనే ప్రగతి భవన్కు చేరుకున్న కేసీఆర్ కొంత మంది మంత్రులతో భేటీ అయినట్లు సమాచారం. లాక్డౌన్తో పాటు పలు అంశాలపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు.
రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించే ప్రతిపాదనకు అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు.. లాక్డౌన్ మినహాయింపులకు సంబంధించి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఈ కేబినెట్ భేటీ కానుంది.