Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 297 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 378 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 808కి తగ్గింది.

Telangana Covid News : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 10వేల 708 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 116 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 49 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 7 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసులకంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం రిలీఫ్ ఇచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 297 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 378 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 808కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 12వేల 311 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 129 మందికి పాజిటివ్ గా తేలింది.

తెలంగాణ కరోనా బులెటిన్..