×
Ad

Revanth Reddy: మా లక్ష్యాలు ఇవే: గ్లోబల్‌ సమిట్‌లో రేవంత్‌ రెడ్డి

పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

Revanth Reddy

Revanth Reddy: దేశంలో కీలకమైన ఆర్థిక నగరం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర సర్కారు నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమిట్‌ కొనసాగుతోంది. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు.

“మాకు మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే మా లక్ష్యం. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం. కేంద్ర సర్కారు కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంది” అని అన్నారు.

Also Read: ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకంటే ముందున్నాం: గ్లోబల్‌ సమిట్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

సీఎం రేవంత్‌ రెడ్డి ఇంకా ఏమన్నారు?

  • తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.
  • 2014లో సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైంది.
  • భారతదేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
  • వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం.
  • దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరా
  • ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడింది.
  • మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం… ప్రజల మద్దతు కోరుతాం.
  • భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం
  • అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నాం.
  • ఈ విజన్ రూపొందించడంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలు
  • ఈ గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం.
  • వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు.
  • ఈ సమ్మిట్ లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం.
  • తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి.
  • మంచి సానుకూల వాతావరణం ఉంది.
  • 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం.
  • దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉంది.
  • దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నాం.
  • 2047 నాటికి భారతదేశ GDPలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం.
  • సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం… ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించాం.
  • మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం.
  • ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్దేశించాం.
  • కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)
  • పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)
  • రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)
  • ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించదలచుకున్నా.
  • గ్వాంగ్‌డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలో అతిపెద్దది.
  • 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారు.
  • తెలంగాణలో కూడా మేము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాం.
  • చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందాం.
  • ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం.
  • మా ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించాం.
  • ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు… కానీ ఆ విజన్ ను సాధించగలం.
  • ఈ విషయంలో మా టీమ్ కు నేను చెప్పేదొక్కటే.. కష్టంగా ఉంటే, వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తా.
  • ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నా.
  • నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక…ఇవాళ మీరందరూ మాతో చేరారు.
  • ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నాం.
  • మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నా.
  • చివరగా… తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ.

మరోవైపు, అంతర్జాతీయ కంపెనీలకు డెస్టినేషన్ హబ్‌గా ఇండియా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సెల్‌ఫోన్ల ఉత్పత్తిలో ఇండియా ఇప్పుడు రెండోస్థానంలో ఉందని తెలిపారు. 10 ఏళ్ల వ్యవధిలో దేశంలో విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగినట్లు చెప్పారు. కేంద్ర సర్కారు పారదర్శకత, జవాబుదారీతనం వల్ల ఇది సాధ్యమైందని వివరించారు.