Telangana Covid Terror News : తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా నాలుగో రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం 434 కేసులు, గురువారం 494 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 493గా ఉంది. కొత్త కేసులు 500లకు చేరువ కావడం టెన్షన్ పెట్టిస్తోంది.
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 29వేల 084 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 493 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 366 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 219 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.(Telangana Covid Terror News)
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 98వేల 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 90వేల 692 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే (3,048) 3వేల 322కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 28వేల 865 కరోనా టెస్టులు చేయగా.. 494 మందికి పాజిటివ్ గా తేలింది.
Covid Vaccine: వ్యాక్సిన్లతో 42లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఇండియా
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని.. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.(Telangana Covid Terror News)
అటు.. దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రాణాంతక వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి కొత్త కేసులు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 17 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 17వేల 336 మంది పాజిటివ్ గా తేలింది. ఫిబ్రవరి తర్వాత ఒక రోజులో 17 వేల పైచిలుకు కొవిడ్ కేసులు రావడం ఇదే తొలిసారి.
గురువారం 13 వేల పైచిలుకు మందికి వైరస్ సోకితే ఒక్క రోజులోనే కొత్త కేసుల సంఖ్య 4వేల 294 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో ఏకంగా 30 శాతం పెరుగుదల నమోదైంది. పాజిటివిటీ రేటు 4.32గా ఉంది. ఈ వారం మొత్తం పాజిటివిటీ రేటు 3.07గా ఉంది.
కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 88వేల 284 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 4,33,62,294కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనాతో మరో 13 మంది మరణించారు. నేటివరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,954కు చేరుకుంది. ఇప్పటిదాకా 196 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేశారు. నిన్న ఒక్కరోజే 13.7 లక్షల మందికి టీకాలు అందించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.24.06.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/9zDz6cuF8Y— IPRDepartment (@IPRTelangana) June 24, 2022