Telangana Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి(25) అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి లో క్రాంతి కిరణ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు.
- bheemraj
- Published On : May 10, 2022 / 05:44 PM IST
America Accident
Telangana student died : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అతన్ని కబలించింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం చెందారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి(25) అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి లో క్రాంతి కిరణ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు.
USA Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు తెలుగు విద్యార్ధులతో సహా ముగ్గురు మృతి
ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రాంతి కిరణ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందాడు. క్రాంతి కిరణ్ మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
