×
Ad

Andhra Pradesh : ఏపీలో ఐఏఎస్ అధికారులు బదిలీ

సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి. జయలక్ష్మిని నియమించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రజత్ భార్గవ్ ను తప్పించింది. ఆయనను ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

  • Published On : April 29, 2023 / 09:20 PM IST

Andhra Pradesh

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రం ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరామును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈడబ్ల్యూఎస్ సంక్షేమ విభాగం అదనపు బాధ్యతలను అప్పగించింది.

సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి. జయలక్ష్మిని నియమించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రజత్ భార్గవ్ ను తప్పించింది. ఆయనను ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయనకు క్రీడలు, సాంస్కృతిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.

Bihar: 36 మంది ఐఏఎస్‭లు, 26 మంది ఐపీఎస్‭ల బదిలీ

మైనారిటీ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్ గా జి.లక్ష్మీషాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింంచింది. గతంలో కూడా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.