Nagarjuna Sagar By Election: సాగర్ టీఆర్ఎస్‌దే.. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ

  • Updated on- May 2, 2021 / 03:08 PM IST

Nagarjuna Sagar By Election

Nagarjuna Sagar By Election Results 2021: నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తిరగి కైవసం చేసుకుంది.

ఉపఎన్నికలో 20వేల పై చిలుకు మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మూడవ స్థానంలో నిలిచారు.

తెలంగాణలో దుబ్బాక ఎన్నికల్లో గెలుపుతో జోష్‌లో ఉన్న బీజేపీ.. సాగర్‌లో మాత్రం డిపాజిట్ కోల్పోయింది.