TSRTC bandh
TSRTC Call For Bandh : ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై టీఎస్ఆర్టీసీ కార్మికులు బంద్ కు పిలుపునిచ్చారు. శనివారం రెండు గంటలపాటు బస్సులు నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. బస్సులు నిలిపివేసి ఆయా డిపోల ముందు ధర్నాలు చేపట్టనున్నారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే గవర్శర్ తమిళిసై ఆమోదం కోసం ఆర్టీసీ బ్లిల్లును రాజ్ భవన్ కు పంపారు. కానీ, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడానికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. మరోవైపు గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) హెచ్చరించింది.
Bandi Sanjay : కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ముంచుతాడు : బండి సంజయ్
ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆర్టీసీలో ఉన్న 43 వేల 373 మంది కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపితే గవర్నర్ మాత్రం అంధకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. తమ జీవితాలలో వెలుగులు నింపే ఈ బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని కోరారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులమంతా కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అవసరమైతే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
KTR: ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం… తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం
ప్రస్తుతం కొసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లును పాస్ చేయాలని రాష్ట్ర భావిస్తోంది. కానీ, ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమ అభిప్రాయం చెప్పలేదు. సాంకేతికంగా మనీ బిల్లు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కాన్సెంట్ కోసం పంపింది. అసెంబ్లీ సెషన్ ముగిసే లోగా గవర్నర్ కాన్సెంట్ చెప్పాలి. కానీ, రెండు రోజుల నుంచి గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.