Medchal Road Accident : మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
ఇద్దరు యువకులు బైక్ పై అతి వేగంగా వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో వారిద్దరూ స్పాట్ లోనే మృతి చెందారు.
- bheemraj
- Published On : July 17, 2023 / 07:49 AM IST
Road Accident (10)
Two Youths Died : మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బహదూర్ పల్లి సమీపంలోని టెక్ మహీంద్ర వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇద్దరు యువకులు బైక్ పై అతి వేగంగా వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో వారిద్దరూ స్పాట్ లోనే మృతి చెందారు. మృతులను యువరాజు, నాయుడుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Woman Killed : కాకినాడ జిల్లాలో మహిళ దారుణ హత్య.. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు
మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
