Minister Amit Shah
Amit Shah Telangana Tour : పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. మరో ఎనిమిది స్థానాల్లో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అత్యధిక స్థానాల్లో బీజేపీ జెండాను ఎగువేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో అగ్రనేతలు ప్రచార సభల్లో పాల్గొంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల తెలంగాణలో రెండు రోజులు ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.
Also Read : CAA : మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ
మరో నెలరోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా సీఏఏపై చర్చ జరుగుతుంది. ఈ సమయంలో తెలంగాణలో కేంద్ర మంత్రి పర్యటన కొనసాగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. సాయంత్రం 6గంటల వరకు తెలంగాణలోని పలు పార్టీ కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు.
Also Read : Mallu Ravi Comments : భట్టి విక్రమార్కకు అవమానం అంటూ బీఆర్ఎస్ మొసలి కన్నీరు : మల్లు రవి కామెంట్స్