YS Sharmila : పార్టీ విలీనంపై షర్మిల సంచలన నిర్ణయం..! కాంగ్రెస్‌కు డెడ్‌లైన్

పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. అక్టోబర్ రెండో వారం నుంచి నేతలు ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు. YS Sharmila

YS Sharmila - YSRTP Merger

YS Sharmila – YSRTP Merger : పార్టీ విలీనంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 30లోగా విలీనంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లేదంటే ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని వెల్లడించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. 33 జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. అక్టోబర్ రెండో వారం నుంచి నేతలు ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు.

కాంగ్రెస్ హైకమాండ్‌కి షర్మిల డెడ్ లైన్..
పార్టీ విలీనంకి సంబంధించి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఒక డెడ్ లైన్ విధించారని చెప్పొచ్చు. వైఎస్ఆర్ టీపీ కార్యవర్గ సమావేశంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు వైఎస్ షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా చర్చలు జరిపారు.

Also Read..Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన తమిళిసై

ఒంటరిగా బరిలోకి దిగే ఛాన్స్..
అయితే పార్టీ విలీనంకి సంబంధించి షర్మిల ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రావడం లేదని వైఎస్ఆర్ టీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30వరకు వేచి చూసే ధోరణి అవలంభించాలని షర్మిల భావిస్తున్నారు. ఈ నెల 30లోపు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి విలీనంపై స్పష్టమైన సానకూలత వస్తే సరేసరి లేదంటే తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం..
కార్యవర్గ సమావేశంలో నేతలు, కార్యకర్తలకు షర్మిల ఇవే సంకేతాలు ఇచ్చారు. 30వ తేదీ వరకు వేచి చూద్దాం, ఆలోపు కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన వస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేద్దాం. అలా కాకుండా కాంగ్రెస్ అధిష్టానం నుంచి సరైన స్పందన లేకపోతే 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు నేతలు, కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు షర్మిల.

డీకే శికుమార్ ద్వారా రాయబారం..
ముందు నుంచి కూడా షర్మిల ఒకే అభిప్రాయంతో ఉన్నారు. తన రాజకీయ, పార్టీ భవితవ్యం కోసం కాంగ్రెస్ ను బెటర్ ఆప్షన్ గా ఎంచుకున్నారు. అందుకే కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాయం కూడా తీసుకుంది. ఆయన ద్వారా మధ్యవర్తిత్వం నడిపించారు. షర్మిల తరపున కాంగ్రెస్ హైకమాండ్ తో డీకే శివకుమార్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

Also Read..Rathod Bapurao: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కి షాక్.. పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా.. ఎందుకంటే?

కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు హోల్డ్ లో పెట్టింది?
ఆ చర్చలు చాలావరకు సఫలం అయినట్లు కనిపిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిల పార్టీ విలీనం అంశాన్ని కొంత హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అలా ఎందుకు చేస్తోంది అనేది తెలియాల్సి ఉంది. మొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు వారిని కలిసేందుకు షర్మిల ప్రయత్నం చేశారు. కానీ, బిజీ షెడ్యూల్ వల్ల షర్మిలకు అపాయింట్ మెంట్ దొరకలేదు. మరోసారి ఢిల్లీకి వెళ్లి వారిని కలిసేందుకు షర్మిల ప్రయత్నం చేస్తున్నా.. ఇంకా ఢిల్లీ నుంచి సానుకూల స్పందన రావడం లేదు. ఈ క్రమంలోనే షర్మిల కాంగ్రెస్ హైకమాండ్ కి ఒక డెడ్ లైన్ పెట్టారు. ఈ నెల 30లోపు కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన వస్తే సరే. లేదంటే ఇక ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని, తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని, 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని షర్మిల యోచన చేస్తున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు