’అన్నదాత సుఖీభవ’ : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. జీవో జారీ

అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది.

  • Publish Date - February 17, 2019 / 09:54 AM IST

అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది.

అమరావతి : అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది. అన్నదాత సుఖీభవ పథకంలో పెంచిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందుబాటులో ఉన్న మంత్రుల నుంచి సంతకాలు తీసుకుని జీవో జారీ చేసింది. తొలి విడతగా రూ.4 వేలు ఇస్తామని సర్కార్ చెప్పింది. అందులో కొంత మొత్తాన్ని మొదటి విడతగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. రేపటిలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ తో ఇబ్బంది లేకుండా ఉండేందుకు వెంటనే రైతు ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. 
 

ట్రెండింగ్ వార్తలు