శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ : రూ.10వేలు ఇస్తే బ్రేక్ దర్శనం

టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చే వారికి వీఐపీ బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నారు. కనీస విరాళం 10 వేల

  • Publish Date - September 23, 2019 / 03:09 PM IST

టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చే వారికి వీఐపీ బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నారు. కనీస విరాళం 10 వేల

టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చే వారికి వీఐపీ బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నారు. కనీస విరాళం 10 వేల రూపాయలు ఇస్తే బ్రేక్‌ దర్శన భాగ్యం కల్పించనున్నారు. దీనిపై త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపు అంశంపై నివేదిక ఇవ్వాలని ఫైనాన్స్ కమిటీకి బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే టీటీడీ ఉద్యోగులకు రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, టీటీడీ విద్యాసంస్థల అడ్మిషన్లలో 2020 నుంచి మేనేజ్‌మెంట్ కోటాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మూడు కొత్త కళ్యాణ మండపాల నిర్మాణానికి టీటీడీ అంగీకారం తెలిపింది. అద్దె ప్రాతిపదికన 40 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు టీడీపీ పచ్చజెండా ఊపింది. అలాగే.. 1381 కేజీల బంగారం ఏడాది కాలానికి బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది.