ఏపీలో ఐపీఎస్ లకు పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పించారు. 18 మంది ఐపీఎస్‌ అధికారులకు ఏపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.

  • Publish Date - February 8, 2020 / 02:30 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పించారు. 18 మంది ఐపీఎస్‌ అధికారులకు ఏపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పించారు. 18 మంది ఐపీఎస్‌ అధికారులకు ఏపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. సూపర్‌ టైం స్కేల్‌ ప్రకారం ఐపీఎస్‌లకు జీతాలు పెంచుతూ శనివారం (ఫిబ్రవరి 8, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్‌ అధికారులకు డీఐజీగా పదోన్నతి కల్పించింది. 

1995 బ్యాచ్ కు చెందిన అధికారులు అతుల్ సింగ్, ఆర్కే మీనాలకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2002 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు సీహెచ్ శ్రీకాంత్, ఎ.ఎస్.ఖాన్, జె.ప్రభాకర్ రావు, డి.నాగేంద్రకుమార్ లకు ఐజీ ర్యాంకు హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కె. రఘురామ్, అకె రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్.జయలక్ష్మి, జీవీజీ అశోక్ కుమార్, జి.విజయకుమార్, ఎస్.హరికృష్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్.వి.రాజశేఖర బాబు, కెవీ.మోహన్రావు, పీహెచ్ డీ రామకృష్ణలకు డీఐజీలుగా పదోన్నతులు కల్పించింది.